తొమ్మిది నెలలుగా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న విషయం తెలిసిందే.

సునీతా విలియమ్స్ ని భూమిపైకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి.

గతేడాది జూన్ 5న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు.

నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్‌‎లో సునీతా,  బచ్ పర్యటన వారం రోజులే.

బోయింగ్‌ స్టార్‌లైనర్‌‎లో టెక్నికల్ ఇష్యూ వాళ్ల వీరు   అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.

దీంతో, దాదాపు తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌ అంతరిక్ష కేంద్రం లోనే ఉంటున్నారు.

సునీతా విలియమ్స్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు  నాసా – స్పేస్ ఎక్స్ క్రూ-10 మిషన్  ప్రయోగాన్ని చేపట్టాయి.

దీంతో ఈ రోజు ఉదయం నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్- 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

మార్చి 19 నాటికి సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది.