తెలుగు సినిమా హీరో నందమూరి తారకరత్న గతనెలలో మరణించిన సంగతి తెలిసిందే.

తారకరత్న చనిపోయి నెల రోజులు అవుతున్నా, ఆ బాధ నుంచి కుటుంబ సభ్యులు బయటపడలేక పోతున్నారు.

అతడి భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తారకరత్న గురించి వరుస పోస్ట్ లు వేస్తూ వస్తోంది.

తారకరత్న తమను విడిచిపెట్టి నెల రోజులు అవుతున్నా.. అతడి జ్ఞాపకాలు తన మదిలో మెదులుతూనే ఉన్నాయని అలేఖ్య చెప్పుకొచ్చింది.

తన భర్త ఎప్పుడూ పెద్ద కుటుంబాన్ని కోరుకునేవాడని.. చివరివరకు అతడి బాధని ఎవరు అర్ధం చేసుకోలేదని అలేఖ్య తెలిపింది.

సొంత వాళ్ళే తన మనసు బాధ పెట్టారని.. మొదటి నుంచి మనతో ఎవరు ఉన్నారో, చివరిలో కూడా వాళ్ళే మిగిలారని అలేఖ్య అంది.

మనం ఎవర్ని అయితే కోల్పోయామో, వాళ్ళు నీ చివరి చూపుకు కూడా రాలేదు.

నేను నీతో ఉన్నది కొంత కాలమే అయినా, నాకు ఎంతో ప్రేమ అందింది. సంతోషం ఉన్న చోట మనం మళ్ళీ కలుద్దాం.

ఇలా తన భర్త గురించి అలేఖ్య చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.