రెడీ అవుతున్న తెలుగు సీక్వెల్స్

విమల్ కృష్ణ డైరెక్షన్లో సిద్దు, నేహ జంటగా నటించిన  DJ టిల్లు సినిమాకి సీక్వెల్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.

నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్లో 8 ఏళ్ల క్రితం వచ్చిన కార్తికేయ సినిమా అప్పట్లో సెన్సేషన్. దానికి సీక్వెల్ గా కార్తికేయ 2 జులై 22న రిలీజ్ అవ్వబోతుంది.

నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన హిట్ సినిమాకి సీక్వెల్ గా అడవి శేష్ హీరోగా హిట్2 జులై 29న రాబోతుంది. దీనికి మరో అయిదు సీక్వెల్స్ కూడా ఇటీవల నాని అనౌన్స్ చేశాడు.

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలుగా అనుదీప్ డైరెక్షన్లో వచ్చి సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు సినిమాకి కూడా సీక్వెల్  రెడీ అవుతోంది.

ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పకి పార్ట్ 2 రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది.

అనిల్ రావిపూడి గతంలోనే F3 కి సీక్వెల్ గా F4 ఉంటుందని ప్రకటించాడు.  బోయపాటి శ్రీను కూడా అఖండ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.