ఫోన్ పే, పేటీఎం, జీపే, వంటి యూపీఐ ఆధారిత చెల్లింపులు ఆఫ్‌లైన్‭లోనూ ఎటువంటి ఆటంకం లేకుండా డబ్బుల లావాదేవీని పూర్తి చేయచ్చన్న విషయం మీకు తెలుసా..? నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు యూపీఐకి అనుసంధానంగా ఉన్న మొబైల్ నుంచి *99# నెంబర్‌ను డైల్ చేస్తే చాలు.. సులువుగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయచ్చు.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి *99# కి డయల్ చేయండి.

ఆ తరువాత స్క్రీన్‌పై కనిపించే పాప్ అప్ మెనూలో ‘సెండ్ మనీ’ అనే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం కీబోర్డ్ లో 1ని ప్రెస్ చేయాలి.

రిసివర్ అకౌంట్‌కు లింకై ఉన్న మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ, ఐఎఫ్ఎస్‌సీ లేదా ఇతర ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

మొబైల్ నెంబర్‌ను ఆప్షన్‌ను ఎంచుకున్నట్టైతే.. డబ్బు పంపాలనుకున్న వారి నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

ఆ తరువాత.. మనం పంపాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేయాలి.

అనంతరం..మన పిన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే డబ్బు బదిలీ సునాయాసంగా జరిగిపోతుంది.

ఇక ఆఫ్‌లైన్ విధానాన్ని వద్దునుకున్న వారు మళ్లీ *99#కు డైల్ చేసి ఈ సదుపాయాన్ని డిసేబుల్ చేయచ్చు.