ప్రపంచంలో నీళ్ల తర్వాత ఎక్కువగా తాగే పదార్థం టీ
ముందుగా తేయాకును పండించింది..
ప్రపంచానికి ఎగుమతి చేసింది చైనానే
ఆ తర్వాత ఆంగ్లేయులు ఇండియాలోని అసోంలో పండించారు
చైనాలో ఇప్పటికీ తేయాకులతో చేసిన టీని మాత్రమే తాగుతారు
ఇండియాతో పాటు చాలా దేశాలలో పాలతో కలిసి టీ తీసుకుంటారు
టీ నీళ్లలో పాలను కలపడం వెనుక కూడా ఓ కారణం ఉందట
అప్పట్లో మొదట మట్టి కప్పులలో టీని సేవించేవారు
ఆ తర్వాత చైనాతో పాటు ఆంగ్లేయులు పింగాణీ కప్పులలో తీసుకొనేవారు
కేవలం టీనీళ్లను కప్పులలో పోస్తే ఆ వేడికి ఆ కప్పులు పగిలిపోయేవి
దీంతో కప్పులో ముందు పాలు పోసి టీ కలపి వేడి తగ్గించేవారు
ఆ రుచి నచ్చడం.. ఆ తర్వాత చక్కర వంటివి కూడా తోడయ్యాయి
అప్పుడు ఆంగ్లేయుల మాదిరిగానే ఇప్పటికీ ఇండియా ఫాలో అవుతుంది