భారత్‌లోకి అతిత్వరలోనే 5G నెట్‌వర్క్ రాబోతోంది.

స్మార్ట్‌ఫోన్ మేకర్లు 5G సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి.

ఈ నెల 23 నుంచి (సెప్టెంబర్) భారత్‌లో ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌లు జరుగనున్నాయి.

ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ అనేక 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

మీరు కొత్త 5G ఫోన్‌ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5G ఫోన్లలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. 

ఈ లిస్టులో OnePlus Nord CE 2, Samsung Galaxy A52, Moto Edge 30 వంటి మరిన్ని స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

OnePlus Nord CE 2 స్మార్ట్‌ఫోన్ రూ. 25వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.

Redmi Note 11 Pro+ మరో 5G స్మార్ట్‌ఫోన్ రూ. 25వేల లోపు కొనుగోలు చేయవచ్చు.