Rahul Gandhi T-Shirt : Rs.41వేల కాస్ట్లీ టీషర్టు వేసుకుని పాదయాత్ర అంటూ బీజేపీ విమర్శలు .. మోడీ ధరించిన రూ.10లక్షల సూట్ మాటేంటీ అంటూ కాంగ్రెస్ ఫైర్

Rs.41వేల కాస్ట్లీ టీషర్టు వేసుకుని పాదయాత్ర అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జైడో యాత్రపై బీజేపీ విమర్శలు చేసింది. దానికి కాంగ్రెస్ మాత్రం తగ్గకుండా మోడీ ధరించిన రూ.10లక్షల సూట్ మాట ఏంటీ అంటూ ఎదురుదాడికి చేస్తోంది.

Rahul Gandhi T-Shirt In Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రపై బీజేపీ విమర్శలు చేస్తోంది. భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్ పై రాజకీయ రగడ మొదలైంది. రూ.41,257 ఖరీదైన టీషర్టు ధరించి పాదయాత్రా? అంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే కాంగ్రెస్ బీజేపీపై ఎదురు దాడి చేస్తోంది. రాహుల్ ధరించిన టీ షర్టు ధర గురించి మీరా విమర్శించేది ప్రధాని మోడీ ధరించిన రూ.10లక్షల ఖరీదైన సూట్ మాటేంటి? అంటూ ఎదురు దాడి చేస్తోంది. రాహుల్ గాంధీ బర్ బెర్రీ బ్రాండ్ కు చెందిన రూ.41,257 విలువైన టీషర్ట్ ధరించి పాదయాత్ర చేస్తున్నారంటూ బీజేపీ దుయ్యబట్టింది.దానికి కాంగ్రెస్ ఏమాత్రం తగ్గకుండా మోడీ ధరించిన సూట్ ల ధరల గురించి చెప్పుకొస్తే బీజేపీ నేతలు నోరు మూసుకోవాల్సి వస్తుంది అంటూ ఏకిపారేస్తోంది.

‘భారత్ జోడో యాత్ర’పై చర్చకంటే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపైనే చర్చ జరుగుతోంది. పాదయాత్రలో రాహుల్ గాంధీ వైట్ టీ షర్ట్ ధరించి కనిపించారు. ఆయన ధరించిన టీ షెర్ట్‌పై బర్‌బెర్రీ బ్రాండ్‌ కనిపించింది. ఆ టీ షర్ట్‌ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా పేరుంది. అంతే కాదు బెర్‌బెర్రీ బ్రాండ్‌ చాలా ఖరీదైనది కావడంతో అంతా అదే అంశంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ టీ షర్ట్ ధర రూ.41,257 అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతోంది.

రాహల్ చేస్తున్నది ‘భారత్ జోడో’ కాదు ‘భారత్ దేఖో’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రాహుల్ ఖరీదైన టీ షర్ట్ ధరించారని..బీజేపీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ట్వీట్ చేసింది. అయితే…బీజేపీ చేస్తున్న కామెంట్స్‌ను తిప్పికొట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు కాంగ్రెస్ మీడియా సెల్.

భారత్ జోడో యాత్ర సందర్భంగా ప్రజా స్పందనను చూసి బీజేపీ భయపడుతోందా?.. అంటూ ప్రశ్నిస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి. ఒకవేళ మనం బట్టల గురించే చర్చించాల్సి వస్తే మోడీ ధరించిన సూటు, కళ్లద్దాల గురించి కూడా మాట్లాడుకుందామని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ స్టార్ట్ అయ్యిందని చెప్పి తీరాల్సిందే.

 

ట్రెండింగ్ వార్తలు