Tirumala : తిరుమలలో ఆ 3 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుపతిలో ఈనెల 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది.

Tirumala :  తిరుపతిలో ఈనెల 14న 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ కార్యక్రమం (దక్షిణాది రాష్ట్రాల సదస్సు) జరుగుతుంది. ఈ సందర్భంగా 13,14,15 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే  ఆ  మూడ్రోజుల పాటు దర్శన టిక్కెట్లను టీటీడీ జారీ చేయనుంది.  భక్తుల ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకుని 12,13,14తేదీల్లో బ్రేక్ దర్శనాలకు లేఖలు తీసుకురావద్దని టీటీడీ ఒక ప్రకటలో కోరింది.

Also Read : Ganja Seized : అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌దీవులు, లక్షద్వీప్ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు పాల్గొంటారు.

ట్రెండింగ్ వార్తలు