Site icon 10TV Telugu

Job Mela: పది పాసైతే జాబ్ గ్యారంటీ.. 11 కంపెనీలు, 500 పైగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం

Job fair on August 14th in Kurnool district

Job fair on August 14th in Kurnool district

ఆంద్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా జరుగనుంది. కర్నూలు జిల్లాలో ఆగస్టు 14వ తేదీన ఈ
జాబ్‌మేళా జరుగనుంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారిక ప్రకటన చేశారు. అలాగే జాబ్ మేళాకి సంబందించిన పోస్టర్‌లను కూడా విడుదల చేశారు. ఇక ఈ జాబ్‌మేళాకు 11 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు హాజరుకానున్నాయి, 500 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. కాబట్టి, జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్న ఈ జాబ్ మేళాను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

విద్యార్హత:
పదవ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

వయోపరిమితి:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలి.

అయితే అభ్యర్థులు ముందుగా ముందుగా Naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్ మేళాకు సంబందించిన మరిన్ని వివరాలు, సందేహాల కోసం 9059290821, 7780478910 ఈ నంబర్లను సంప్రదించవచ్చు.

Exit mobile version