Virushka scooty ride: అనుష్కను ఎక్కించుకుని ముంబైలో స్కూటీపై చక్కర్లు కొట్టిన విరాట్ కోహ్లీ

టీమిండియా క్రికెటర్ విరాట్ కొహ్లీ తన భార్య, హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి స్కూటీపై ముంబైలోని మాద్ ఐస్‌ల్యాండ్ లో వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిజీ షెడ్యూళ్ళతో ఉండే ఈ జంట సమయం దొరికిన ప్రతిసారి దాన్ని ఎంజాయ్ చేస్తుంటుంది. నిన్న స్కూటీపై తన భర్తతో కలిసి వెళ్తున్న సమయంలో అనుష్క నలుపు రంగు దుస్తులు ధరించింది. కొహ్లీ నలుపు రంగు ప్యాంటు, ఆకుపచ్చ రంగు చొక్కా వేసుకున్నాడు. కొహ్లీ, అనుష్క ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్లు కూడా పెట్టుకున్నారు.

Virushka scooty ride: టీమిండియా క్రికెటర్ విరాట్ కొహ్లీ తన భార్య, హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి స్కూటీపై ముంబైలోని మాద్ ఐస్‌ల్యాండ్ లో వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిజీ షెడ్యూళ్ళతో ఉండే ఈ జంట సమయం దొరికిన ప్రతిసారి దాన్ని ఎంజాయ్ చేస్తుంటుంది. నిన్న స్కూటీపై తన భర్తతో కలిసి వెళ్తున్న సమయంలో అనుష్క నలుపు రంగు దుస్తులు ధరించింది. కొహ్లీ నలుపు రంగు ప్యాంటు, ఆకుపచ్చ రంగు చొక్కా వేసుకున్నాడు. కొహ్లీ, అనుష్క ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్లు కూడా పెట్టుకున్నారు.

వారి ఫొటోలు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ప్రపంచంలోనే గొప్ప జంట అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొహ్లీ, అనుష్క పెళ్ళి 2017, డిసెంబరు 11న ఇటలీలో జరిగింది. 2022లో వీరికి పండంటి ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు వామికా అని పేరు పెట్టారు. అనుష్క శర్మ ప్రస్తుతం చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఆమె చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. చివరిసారిగా, 2018లో విడుదలైన షారుక్ ఖాన్ సినిమా జీరోలో ఆమె నటించింది.

ట్రెండింగ్ వార్తలు