Yadadri Temple : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఇక ఈ రోజు స్వామి వారికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది. టికెట్ బుకింగ్, లడ్డు ప్రసాదం, ప్రత్యేక దర్శనాలతో పాటు వివిధ సేవలు పూజ కార్యక్రమాల ద్వారా ఒక్కరోజే స్వామి వారికి రూ. 15,47,185 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.
Read More : Evaru Meelo Koteeswarulu: తారక్ షో.. దసరాకి మహేష్.. దీపావళికి ప్రభాస్!
ప్రధాన బుకింగ్ ద్వారా 2,53,650.
రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 19,600.
వీఐపీ దర్శనాలతో 1,73,250.
వేద ఆశీర్వచనం ద్వారా 10,836.
సుప్రభాతం ద్వారా 2,200.
ప్రచారశాఖ ద్వారా 220.
క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 5,500.
వ్రత పూజలతో 40,500.
కల్యాణకట్ట టిక్కెట్లతో 32,000.
ప్రసాద విక్రయం ద్వారా 7,13,190.
వాహనపూజల ద్వారా 16,500.
టోల్గేట్ ద్వారా 2,530.
అన్నదాన విరాళం ద్వారా 8,381.
సువర్ణ పుష్పార్చన ద్వారా 1,34,500.
యాదరుషి నిలయంతో 75,560.
పాత గుట్ట నుంచి 30, 770.
గోపూజ ద్వారా 650.
మొత్తంగా రూ.15,47,185 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.
Read More : Shriya Saran: ఆహా ఏం అందం.. డోస్ పెంచి పిచ్చెక్కిస్తున్న శ్రేయా