బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న వేళ ఆయనకు ఒక్కసారిగా వెన్నునొప్పి వచ్చింది. దీంతో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆయన కారులో ఎక్కడానికి కొందరు సాయం చేశారు. ఎన్నికల వేళ అరారియాలో ఆర్జేడీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని తేజస్వీ యాదవ్ ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనను ఇలా వెన్నునొప్పి వేధించింది.
బిహార్లో ఎన్నికలు 19 ఏప్రిల్ నుండి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 40 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి. దేశంలో 7 దశల్లోనూ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మూడు ఉన్నాయి. అవి.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్.
మే 7న జరిగే మూడో దశ ఎన్నికల్లో భాగంగా బిహార్ లోని ఝంజర్పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియాలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ స్థానాల్లో తేజస్వీ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
#WATCH | Former Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav was helped to his car after he experienced sudden back pain and faced difficulty in walking. He was addressing a public rally in Araria when the incident occurred.
(Video: Tejashwi Yadav’s media) pic.twitter.com/h5OcvbAsFW
— ANI (@ANI) May 3, 2024
Rahul Gandhi Video: రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం