PM Modi : రోమ్ కు మళ్లీ వెళ్లాలని..ట్రెవీ ఫౌంటెయిన్​ లో కాయిన్ విసిరిన మోదీ

ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు జీ-20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ప్రధాని మోదీ రోమ్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

PM Modi  ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు జీ-20 సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ప్రధాని మోదీ రోమ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం జీ-20 సదస్సు రెండో రోజులో భాగంగా రోమ్​లోని ప్రసిద్ధ ట్రెవీ ఫౌంటెయిన్​కు మోదీ వెళ్లారు.

పలు ప్రపంచ దేశాధినేతలతో కలిసి ట్రెవీ ఫౌంటెయిన్​కు వెళ్లిన మోదీ..వెనుకకు తిరిగి అక్కడి నీటిలో ఓ నాణెం విసిరారు. అలా భుజం మీదుగా నీళ్లలో నాణెం విసిరితే మళ్లీ రోమ్​ వెళ్తారని ప్రజల నమ్మకం. దీంతో మోదీ కూడా ఇతర నేతలతో కలిసి ఇదే పని చేశారు.

కాగా,ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫౌంటెయిన్లలో ట్రెవీ ఒకటి. చక్కటి శిల్పకళా నైపుణ్యం దీని సొంతం. ట్రెవీ ఫౌంటెయిన్ సందర్శన సమయంలో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​, జర్మనీ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​తో మోదీ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.

ALSO READ Ajay Misra : కేంద్రమంత్రి మిశ్రా కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి

ట్రెండింగ్ వార్తలు