Ap Online Cinema Ticketing : ఏపీ సినిమా టికెట్లపై మరో జీవో జారీ…

ఏపీ సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ వివాదం పూర్తిగా సద్దుమణగకముందే ప్రభుత్వం మరో కొత్త జీవో 142ను జారీచేసింది.

Ap Online Cinema Ticketing :   ఏపీలో సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలపై గత కొన్ని నెలలుగా చర్చలు నడిచాయి. సినీ పెద్దలు ఏపీ సీఎం, మంత్రులని కలిసి వారి సమస్యలని వినిపించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఇటీవల సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి జీవో 35ని జారీ చేసారు. ఈ బిల్లు సినీ పరిశ్రమకి, థియేటర్లకు నష్టాన్ని కలిగించేలా ఉందే తప్ప ఎవరికీ లాభం చేకూర్చేలా లేదు అంటూ చాలా మంది సినీ పెద్దలు, థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ఈ బిల్లు వల్ల టికెట్ రేట్లు భారీగా తగ్గడమే కాక బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు కూడా ఉండవు.

అయితే ఈ జీవోపై కోర్టుకి వెళ్లారు కొంతమంది. ఏపీ సినిమా టికెట్లకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే ఈ వివాదం పూర్తిగా సద్దుమణగకముందే ప్రభుత్వం మరో కొత్త జీవో 142ను జారీచేసింది.

Bigg Boss : లేడీ కంటెస్టెంట్స్ అందాల ఆరబోతకే పరిమితమా? టైటిల్ ఇవ్వరా??

ఈ జీవో ఉత్తర్వుల ప్రకారం సినిమా టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఆన్‌లైన్‌ లోనే జరగాలి. టికెట్ల అమ్మకాల బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ లాంటి ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారానే ప్రేక్షకులు సినిమా టికెట్లను కొనుక్కోవాలి. ఇది అమలులోకి వచ్చాకా బుక్ మై షో లాంటి ప్రైవేటు బుకింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఏపీలో టికెట్స్‌ను బుక్‌ చేసుకోవడం కుదరదు. దీని వల్ల వాళ్లకి కూడా నష్టమే. అయితే త్వరగా వెబ్ సైట్ ని రూపొందించి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది.

Nani : బిగ్‌బాస్ హోస్ట్‌గా నాని.. ఇది నా రీయూనియన్

ట్రెండింగ్ వార్తలు