bjp: తెలంగాణలో అరాచక పరిపాలన కొనసాగుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హైదరాబాద్లో బీజేపీ నిర్వహిస్తోన్న విజయ సంకల్ప సభలో యోగి మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందట్లేదని అన్నారు. తాము ఉత్తరప్రదేశ్లో 15 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని, తెలంగాణలో అటువంటి పథకాలు అందట్లేదని విమర్శించారు. తాము ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్’ అనే భావనతో ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు.
Maharashtra: నన్ను సీఎంను చేసి మోదీ, షా అందరి కళ్ళూ తెరిపించారు: ఏక్నాథ్ షిండే
సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సరైన సమాధానం చెప్పేందుకే ఇవాళ భారీసంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పరేడ్ గ్రౌండ్కు తరలివచ్చారని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తాము వర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకుంటామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, టీఆర్ఎస్ పాలనపై తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత ఉందని అన్నారు. తెలంగాణలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.