Brigadier Lakhwinder Singh Lidder : భర్త శ‌వ‌పేటిక‌ను ముద్దాడిన బ్రిగేడియ‌ర్ ల‌ఖ్వింద‌ర్‌సింగ్ లిద్ద‌ర్ భార్య‌..

‘‘ఆయన మ‌ర‌ణం తీర‌ని లోటు..నేను ఓ సైనికుడి భార్య‌ని..అది నాకు గర్వకారణం’..అంటూ భర్త శ‌వ‌పేటిక‌ను ముద్దాడి చివరి వీడ్కోలు పలికారు బ్రిగేడియ‌ర్ ల‌ఖ్వింద‌ర్‌సింగ్ లిద్ద‌ర్ భార్య‌.

Brigadier Lakhwinder Singh Lidder : త‌మిళ‌నాడులో జ‌రిగిన హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తోపాటు మరో 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో బ్రిగేడియ‌ర్ ల‌ఖ్వింద‌ర్‌సింగ్ లిద్ద‌ర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో మరణించిన ఆర్మీ వీరులకు అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. ఈ ఉద‌యం లిద్ద‌ర్ భార్య గీతా లిద్ద‌ర్‌, కుమార్తె ఆస్నా లిద్ద‌ర్ అశ్రున‌య‌నాల‌తో ఆయ‌నకు తుది వీడ్కోలు ప‌లికారు.

ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మ‌శాన‌వాటిక‌లో భావోద్వేగాలు, గుండెలను మెలిపెట్టాయి ఆ దృశ్యాలు. కానీ మిలటరీ కుటుంబం కాబట్టి చాలా మానసిక స్థైర్యాన్ని చూపించారు. అయినా పొంగుకొచ్చే దు:ఖం మాత్రం కనిపిస్తునే ఉంది. గుండెల్ని మెలిపెట్టే దృశ్యాల న‌డుమ బ్రిగేడియ‌ర్ లిద్ద‌ర్‌కు  బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈసందర్భంగా లిద్దర్ భార్య గీతా లిద్దర్ భర్త శవపేటికను ముద్దాడారు. ఇదే నా కడసారి వీడ్కోలు అంటూ గుండెల్ని చిక్కబట్టుకుని ఆయనకు నవ్వుతు వీడ్కోలు పలికారు.
Read more : lidder Daughter Aashna : ‘మా నాన్న హీరో’..హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లిద్ద‌ర్ కుమార్తె ఆస్నా..
ఈ సందర్భంగా గీతా మాట్లాడుతు..‘‘ఆయన మ‌ర‌ణం మాకు ఎన్నిటికీ తీర‌ని లోట‌i..నేను ఓ సైనికుడి భార్య‌ని..అది నాకు గర్వకారణం..అని తెలిపారు. ఆయన మాకు ఇచ్చిన ధైర్యాన్ని మనోస్థైర్యంగా చేసుకుని ఆయనకు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికామ‌ని..వీరులకు మనం నవ్వుతు వీడ్కోలు పలకాలు..నేను ఓ వీర సైనికుడు భార్యను అదినాకు చాలా గర్వం అని కన్నీటి సుడులు తిరుగుతుండగా తెలిపారు. ఈ మాట‌లు చెబుతూ ఆమె ఉబికివ‌స్తున్న‌ దుఃఖాన్ని పంటిబిగువున అణిచిపెట్ట‌డం చూసేవారికి కంటతడి పెట్టించింది.

ట్రెండింగ్ వార్తలు