Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతున్నాయి. శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే అసోంలోని గువాహటిలో హోటల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంకా ఎంత కాలం గువాహటిలో దాక్కుంటారు. మీరు ఎప్పటికైనా ముంబైలోని చౌపాటీకి రావాల్సిందే అని ఆయన ట్వీట్ చేశారు.
Maharashtra: పతనం అంచున ‘మహా’ సర్కారు.. శరద్ పవార్ నివాసంలో కీలక భేటీ
కాగా, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే లక్ష్యంగా నేటి మధ్యాహ్నం తన వర్గం ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, శివసేన, కాంగ్రెస్ నేతలతో ఎన్సీపీ అధినేత కీలక చర్చలు జరుపుతున్నారు.