Amarnath pilgrims : జమ్మూ నుంచి అమరనాథ్ యాత్రకు లెఫ్టినెంట్ గవర్నర్ పచ్చజెండా

జమ్మూ నగరం నుంచి అమరనాథ్ యాత్ర మొదటి బ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది.జమ్మూ నగరంలో శుక్రవారం ఉదయం అమరనాథ్ యాత్రికుల మొదటి బృందానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు....

Amarnath pilgrims

Amarnath Yatra pilgrims : జమ్మూ నగరం నుంచి అమరనాథ్ యాత్ర మొదటి బ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది. జమ్మూ నగరంలో శుక్రవారం ఉదయం అమరనాథ్ యాత్రికుల మొదటి బృందానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. (Jammu and Kashmir Lt. Governor Manoj Sinha on Friday flagged off) ఈ యాత్ర సందర్భంగా భారీ సాయుధ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  3,300 మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ 159 ఎస్కార్టెడ్ వాహనాల్లో భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి కాశ్మీర్ లోయలోని బల్తాల్ పహల్గామ్ బేస్ క్యాంపులకు బయలుదేరింది.

Uniform Civil Code : పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ బిల్లు

62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 31న శ్రావణ పూర్ణిమ పండుగతో ముగియనుంది. ప్రధాన గుహ మందిరాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.  గండర్‌బల్ జిల్లాలో 13 కిలోమీటర్ల పొడవు గల బాల్తాల్ మార్గం, అనంతనాగ్‌లోని 43 కిలోమీటర్ల పొడవైన పహల్గామ్ మార్గాల మీదుగా యాత్రికులు గుహకు చేరుకుంటారు. బాల్టాల్ మార్గంలో వెళ్లే యాత్రికులు అదే రోజు బేస్ క్యాంప్‌కు తిరిగి వస్తారు.

DMK Minister Senthil Balaji : తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం..మంత్రి డిస్మిస్ ఉత్తర్వు వెనక్కి

సంప్రదాయ పహల్గామ్ మార్గంలో ఉన్న యాత్రికులు మందిరానికి చేరుకోవడానికి మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహ మందిరంలో పవిత్రమైన లింగం ఉంది. ఇది శివుని పౌరాణిక శక్తులకు ప్రతీక అని భక్తుల నమ్మకం. యాత్ర శాంతియుతంగా సాగేందుకు వీలుగా సైన్యం, పారామిలటరీ బలగాలు, స్థానిక పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

Extreme Temperatures : మెక్సికోలో మండుతున్న ఎండలతో 112 మంది మృతి

అధిక ఎత్తులో ఉన్న అనారోగ్యం కారణంగా మరణాలను నివారించడానికి అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమర్‌నాథ్ యాత్రను 2023 పొగాకు రహితంగా ప్రకటించారు. యాత్రికులకు ఎలాంటి జంక్ ఫుడ్, హల్వా అందించవద్దని రెండు మార్గాల్లో నడిచే కమ్యూనిటీ కిచెన్‌లకు కూడా సూచించారు. ఈ యాత్రలో యాత్రికులు శీతల పానీయాలు తీసుకోకుండా ఉండేలా వాటిపై కూడా నిషేధం విధించారు.

ట్రెండింగ్ వార్తలు