Uddhav Thackeray: ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని వీడిన ఎమ్మెల్సీ మనీషా.. షిండే వర్గంలోకి జంప్..

మనీషా కయాండే షిండే వర్గంలో చేరడంపై ఉద్దవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్ స్పందించారు. కొందరు స్వార్థం కోసం పార్టీలో చేరుతున్నారని, స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని అన్నారు.

Maharashtra Politics: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యుబిటి) ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వర్గంలోఉన్న ఎమ్మెల్సీ మనీషా కయాండే షిండే వర్గంలోచేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం ఆమె షిండే వర్గంలో చేరనున్నారు. ఎమ్మెల్సీ మనీషా కయాండే ఈరోజు సాయంత్రం శివసేనలోకి వస్తారని ఆ పార్టీ నేత సంజయ్ సిర్పత్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అధికార నివాసంలో ఆమె శివసేనలో చేరుతారని చెప్పారు.

Uddhav Thackeray: ఉద్దవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం.. సుప్రింకోర్టులో ఉద్దవ్ వర్గానికి దక్కని ఊరట

మనీషా కయాండే షిండే వర్గంలో చేరడంపై ఉద్దవ్ వర్గానికి చెందిన సంజయ్ రౌత్ స్పందించారు. కొందరు స్వార్థం కోసం పార్టీలో చేరుతున్నారని, స్వార్థం కోసం పార్టీని వీడుతున్నారని అన్నారు. మనీషా కయాండే మా వర్గాన్ని వీడటం వల్ల మాకు ఎలాంటి నష్టం లేదని సంజయ్ రౌత్ చెప్పారు. స్వార్థపరులను గుర్తించడంలో మేము తప్పు చేశాము. గత కొన్నేళ్లుగా ఈ తప్పు జరుగుతోందని అన్నారు. నేను ఉద్దవ్ ఠాక్రేతో కూడా దీని గురించి చర్చిస్తున్నానని రౌత్ చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు