Jammu and Kashmir: జమ్ము-కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్కు చెందిన తీవ్రవాది హతమయ్యాడు. జమ్ము-కశ్మీర్.. కుల్గామ్ జిల్లా, మిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఈ క్రమంలో సైన్యాన్ని గమనించిన తీవ్రవాది, భద్రతా దళాలపై కాల్పులు జరిపాడు.
వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో పాకిస్తాన్లోని జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన ఒక తీవ్రవాది హతమయ్యాడు. అయితే, ఇంకా తీవ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు.