Chiranjeevi : ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కథ చిరంజీవి చేయాల్సింది.. నిర్మాత అశ్వినీదత్!

టాలీవుడ్ నిర్మాత అశ్వినీ దత్ చిరంజీవి కోసం రాయించిన కథే 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్. అయితే..

aswini dutt said The Family Man series story is written for Chiranjeevi

Chiranjeevi : ప్రస్తుతం వెబ్ సిరీస్ కల్చర్ పై ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో టాప్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, నాగచైతన్య, సమంత.. వంటి స్టార్స్ పలు వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు కూడా ఒక వెబ్ స్టోరీ కథ వచ్చిందట. అది కూడా ఇండియన్ సిరీస్ లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man). ఈ కథని చిరంజీవి కోసమే రాశారట.

Ram Charan : ఇంటర్నేషనల్ అవార్డు నామినేషన్స్‌లో రామ్‌చరణ్..

టాలీవుడ్ నిర్మాత అశ్వినీ దత్ చిరంజీవి పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. అలాగే రామ్ చరణ్ ని చిరుత సినిమాతో పరిచయం చేశాడు. ఇక చిరు రీ ఎంట్రీ తరువాత మళ్ళీ ఒక ప్రాజెక్ట్ చేయాలనీ ప్రయత్నిచాడట. ఈక్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేని పిలిపించి.. ఫ్యామిలీ మ్యాన్ కథని సిద్ధం చేయించాడట. ఈ కథని చిరంజీవికి కూడా వినిపించారు. అయితే చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అవ్వలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు.

Allu Arjun : ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ మొదటివాడట.. అది ఏంటో తెలుసా..?

అయితే ఈ కథని చిరుతో సినిమాగా తీయాలని అనుకున్నారు. ఒకవేళ చిరంజీవి గనుక ఈ స్టోరీ చేసి ఉంటే ఓ రేంజ్ లో ఉండేదని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సిరీస్ ని బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) హీరోగా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సీజన్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. సెకండ్ సీజన్ లో సమంత ప్రధాన పాత్ర పోషించి ఇండియా వైడ్ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం మూడో సీజన్ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు