Manchu Vishnu : టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం వరుస సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమస్యలకి పరిష్కారం దొరికేదాకా షూటింగ్స్ నిలిపివేశారు. ఆర్టిస్టుల సైడ్ నుంచి సమస్యల పరిష్కారం కోసం బుధవారం ప్రొడ్యూసర్ గిల్డ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)తో మీటింగ్ నిర్వహించింది. దీనికి మా తరపున మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, జీవిత, రఘుబాబు హాజరయ్యారు. ఇక ప్రొడ్యూసర్ గిల్డ్ నుంచి దిల్ రాజు, మైత్రి రవి, శరత్ మరార్, దామోదర ప్రసాద్.. మరి కొంతమంది నిర్మాతలు హాజరయ్యారు.
Dil Raju : మాలోమాకు గొడవలు లేవు.. మా షూటింగ్స్ మేమే ఆపుకున్నాం..
ఈ మీటింగ్ పై మంచు విష్ణు ట్వీట్ చేశాడు. దిల్ రాజుతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి..”మా అసోసియేషన్ తరపున తెలుగు సినిమా ప్రొడ్యూసర్లను కలవడం ప్రారంభించాము. సినిమాలలో ఎక్కువగా మా మెంబర్ షిప్ ఉన్న ఆర్టిస్టులనే తీసుకోవాలని కోరాము. కొత్త ఆర్టిస్టులని తీసుకొస్తే వారిని ‘మా’లో మెంబర్ షిప్ తీసుకునేలా ప్రోత్సహించాలని అడిగాము” అని పోస్ట్ చేశారు.
Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J
— Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022