Venkaiah Naidu : టాలీవుడ్ సీనియర్ నటుడు స్వర్గీయ ‘అక్కినేని నాగేశ్వరరావు’ (Akkineni Nageswara Rao) శతజయంతి వేడుక నేడు (సెప్టెంబర్ 20) హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఏఎన్నార్ విగ్రహావిష్కరణ జరిగింది. ఇక ఈ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యి లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నెపోటిజం పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Venkaiah Naidu : నేటి సినిమా మేకర్స్ పై వెంకయ్య నాయుడు విమర్శలు.. డబల్ మీనింగ్ డైలాగ్స్..
టాలీవుడ్ లో నాలుగు పెద్ద కుటుంబాలు అక్కినేని, మెగా, నందమూరి, దగ్గుబాటి ఫామిలీస్. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే వారసులు వచ్చి పరిశ్రమలో నటిస్తూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక వీరి ఎంట్రీ పై, రాబోయే మరికొందరు వారసులు పై ఎప్పటినుంచో విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెపోటిజం గురించి వెంకయ్య నాయుడు ఒక క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయంలో వారసత్వాన్ని ప్రోత్సహించానని.. కానీ సినిమా, ఇతర రంగంలో ఆ వారసత్వాన్ని సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు.
“రాజకీయంలో వారసుడు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ సినిమా రంగంలో అలా కుదరదు. ఇక్కడ నటుడిగా, కళాకారుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే ఎంత వారసత్వమైనా నిలబడలేరు. అందువలనే నేను సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ప్రోత్సహిస్తాను. అలాగే అక్కినేని వారసులు నాగేశ్వరరావు గారి వారసత్వాన్ని నిలబడతారని నేను ఆశిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.
Vishal : చంద్రబాబు అరెస్ట్ పై హీరో విశాల్ కామెంట్స్.. భయం కలుగుతోంది అంటూ..
వెంకయ్య నాయుడు మాటలతో నెపోటిజం వాదనలు మరోసారి నెట్టింట వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక నెటిజెన్.. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ ఎంట్రీ గురించి విమర్శించగా.. రేణూ దేశాయ్ కూడా వెంకయ్య నాయుడు లాగానే సమాధానం ఇచ్చారు. సినిమా పరిశ్రమలో ఒక వారసుడికి ఎంట్రీ మాత్రమే ఈజీ అవుతుంది. ఆ తరువాత ఆ వారసుడు నిలబడడం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నదని, ఎన్నో భాద్యతలు, నిందలు మోయాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు.