Anushka Sharma : భర్త కోహ్లీని ఓదార్చిన అనుష్క శర్మ.. వైరల్ చిత్రం

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత తన భర్త విరాట్ కోహ్లీని అనుష్కశర్మ ఓదార్చారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది....

Anushka Sharma Kohli Hug

Anushka Sharma : క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత తన భర్త విరాట్ కోహ్లీని అనుష్కశర్మ ఓదార్చారు. ప్రపంచ టోర్నీలో అన్ని మ్యాచ్ లలో భారత జట్టు బాగా ఆడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో టీమ్ ఇండియా హార్ట్‌బ్రేక్ తర్వాత విరాట్ కోహ్లీని కౌగిలించుకొని అనుష్క శర్మ ఓదార్చింది. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నీలిమయంగా మారిన స్టేడియం

ఆస్ట్రేలియాపై భారత్ హృదయ విదారక ఓటమిని ఎదుర్కొంది. అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న వైరల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను కదిలించింది. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అభిమానులు బ్లూకలర్ జెర్సీ ధరించి రావడంతో స్టేడియం నీలిమయంగా మారింది. ఆరు వికెట్ల పరాజయం అనంతరం అనుష్కశర్మ కోహ్లీని వెచ్చని కౌగిలింతతో ఓదార్చడం అందరినీ కదిలించింది.

ALSO READ : PM Modi : ఫైనల్లో భారత్ ఓటమి.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

గెలుపు, ఓటమి సరిహద్దులను దాటిన ప్రేమతో అనుష్క కోహ్లీకి హగ్ ఇచ్చింది. అనుష్క శర్మ గర్భం దాల్చిందనే ఊహాగానాల మధ్య ప్రపంచ కప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీకి ఆమె తిరుగులేని మద్దతు ఇచ్చింది. విరాట్ 50 పరుగుల మైలురాయిని చేరుకున్నప్పుడు అనుష్క తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది. అనుష్క కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి మైదానం వీడేటప్పుడు కన్నీటిపర్యంతమయ్యారు.

నిరాశ చెందిన సెలబ్రిటీలు

షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్, దీపికా పదుకొణె వంటి ప్రముఖులు ఓటమితో నరేంద్ర మోడీ స్టేడియంలో తీవ్ర నిరాశ చెందారు. ఆస్ట్రేలియా ట్రోఫీని కైవసం చేసుకోవడంతో వాతావరణం గంభీరంగా మారింది. స్టాండ్‌ల నుంచి ఆనందోత్సాహాలు కరువయ్యాయి. అనుష్కశర్మ, అతియాశెట్టిలు నిరుత్సాహంగా కనిపించారు.

ALSO READ : Team India : అప్పుడు, ఇప్పుడు విల‌న్ ఆస్ట్రేలియానే.. భార‌త్‌కే ఎందుకిలా జ‌రుగుతోంది..?

విరాట్ కంటతడి పెట్టుకున్న అనుష్కను కౌగిలించుకున్నట్లుగా చిత్రీకరించిన ఒక ఫోటో మ్యాచ్ అనంతరం బయటకు వచ్చింది. ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును అందుకున్నారు. అనుష్క శర్మ వైరల్ చిత్రం ఎక్స్ లో పోస్టు అయింది.

 

ట్రెండింగ్ వార్తలు