cheddi gang In AP :బెజవాడను బేజారెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్..పోలీసులకు సవాల్ గా వరుస దోపిడీలు

బెజవాడను చెడ్డీ గ్యాంగ్ బేజారెత్తిస్తోంది. ఏపీలోని కృష్టా, గుంటూరు జిల్లాలే కాకుండా విజయవాడలో వరుస దోపిడీలో పాల్పడుతు పోలీసులకు సవాల్ విసురుతోంది.

cheddi gang series robberies :  దోపీడీలతో చెడ్డీగ్యాంగ్ హడలెత్తిస్తోంది. ఏపీలోని చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పోలీసులకు తలలు పట్టుకుంటున్నారు. వారిని పట్టుకోవటానికి పోలీసులు ఎన్ని బృందాలు గాలిస్తున్నా చిక్కటంలేదు సరికదా..పలు దోపిడీలు చేస్తు పోలీసులకే సవాలు విసురుతున్నారు. హైదరాబాద్ జంటనగరాలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్‌ ఇప్పుడు ఏపీలో వరుస దోపిడీలతో హల్ చల్ చేస్తోంది. ఈ దోపిడీల్లో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరక్కుండా చెడ్డీగ్యాంగ్ చాకచక్యంగా వరుస దోపిడీలతో హడలెత్తిస్తోంది.

ఏపీలోని కడప జిల్లా పులివెందుల నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు చెడ్డీగ్యాంగ్‌ వరుస దోపిడీలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో దొంగతనాలు చేసిని ఈ ముఠా ఇప్పడు విజయవాడలో ప్రత్యక్షమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారి కోసం గాలిస్తున్నా ఏమాత్రం చిక్కటంలేదు.

Read more : Chaddy Gang : విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ దోపిడీ

ఇప్పుడు తాజాగా చెడ్డీ గ్యాంగ్ బెజవాడ వాసుల్ని బేజారెత్తిస్తున్నారు. బెజవాడ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. బెజవాడ పోలీసులకు సవాల్ గా మారింది చెడ్డి గ్యాంగ్.వసరగా పాల ఫ్యాక్టరీ, గుంటుపల్లి, రైయిన్ బో విల్లాస్ లో వారం రోజుల్లో వ్యవధిలోనే వరుస చోరీలతో హడలెత్తిస్తోంది చెడ్డీగ్యాంగ్.కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఏదోక ప్రదేశం సంచరిస్తు ప్రజల భయబ్రంతులకు గురి చేస్తోంది చెడ్డి గ్యాంగ్. చెడ్డి గ్యాంగ్ పేరు వింటేనే ప్రజలు గడగడలాడిపోతున్నారు.

చిట్టినగర్‌, గుంటుపల్లిలో చెడ్డీగ్యాంగ్‌ ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటేవలే ఈ ముఠా పులివెందుల, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు దోపిడీలకు పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ గ్యాంగ్‌ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలో పోలీసులు చెడ్డీగ్యాంగ్‌ ఆటకట్టించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు పట్టణం నుంచి పల్లెల వరకు గాలిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. 8కిపైగా పోలీసుల టీములు వీరి కోసం గాలిస్తున్నాయి. అయినా చెడ్డీగ్యాంగ్ ఏమాత్రం చిక్కట్లేదు. చెడ్డిగ్యాంగ్ సంభందించి ఇప్పటి వరకు పోలీసులకు ఎటువంటి క్లూస్ దొరకలేదు.

Read more : Students Sentenced : తోటి విద్యార్థిని హత్యచేసిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించిన కోర్టు

దీంతో చెడ్డి గ్యాంగ్ అచూకి ఇప్పటి వరకు కనిపెట్టలేక పోవడంతో పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు పెద్దవారికి కాపలా కాయటమే సరిపోతోంది. ప్రజల గురించి పట్టదా? అని విమర్శిస్తున్నారు. ప్రజలు నిరంతరం జాగ్రత్తగా ఉండాలంటు ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు. కానీ పోలీసులు తాము చెడ్డీగ్యాంగ్ ను పట్టుకోవటానికి యత్నిస్తున్నామంటున్నారు. తాజాగా విజయవాడ పోరంకి వసంత నగర్ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేసింది. పలు దోపిడీలతో పోలీసులకు సవాల్ విసురుతోంది. కాగా చెడ్డీగ్యాంగ్ దోపిడీల్లో తమమార్కు చూపిస్తోంది. చెడ్డీగ్యాంగ్‌లో ఉన్న సభ్యులు ఒంటిమీద దుస్తులు లేకుండా ఒక్క చెడ్డీ మాత్రమే ధరించి, తలపాగాలు చుట్టి రెండు ఇళ్ల మధ్యలో ఉన్న సందులో వెళ్తున్నట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి.  అలా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నా ఏమాత్రం చిక్కుకుండా పోలీసులకు చెడ్డీ గ్యాంగ్ చుక్కలు చూపిస్తోంది. ప్రజల్ని హడలెత్తిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు