TJR Sudhakar Babu : మహిళలు విశ్వరూపం చూపించారు, జూన్ 4న టీడీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది- వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు

కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందకి రండి. టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారు.

TJR Sudhakar Babu : ఏపీలో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆ పార్టీ నేత, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. దేశంలోనే అధిక శాతం ఓటింగ్ ఏపీలో నమోదవ్వడం శుభపరిణామం అన్నారాయన. ఇది మహిళా విప్లవం అని అభివర్ణించారు. సునామీలా ఓటు రూపంలో సీఎం జగన్ పై ప్రేమ చూపించారని చెప్పారు.

”5 లక్షల మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు విశ్వరూపాన్ని చూపించారు. అధికశాతం ఓటింగ్ వ్యతిరేకత కాదు జగన్ కు మద్దతుగా జరిగింది. నిమ్న వర్గాలకు మంచి చేసిన జగన్ రుణం తీర్చుకోవడానికి పోటెత్తారు. కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందకి రండి. టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఓటమి భయంతో కడుపు మంటతో విధ్వంసం సృష్టిస్తున్నారు. రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మీకు ఓట్లు వేస్తారు..? జూన్ 4వ తేదీన టీడీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది” అని ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు.

ఈసారి ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. గత 4 విడతల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం. ఈవీఎంల ద్వారా 80.66, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదైంది. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ జరగ్గా.. అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినిగియోంచుకున్నారు.

వీరు ఎవరికి మద్దతుగా నిలిచారు అన్నది పార్టీలకు అంతుచిక్కడం లేదు. పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వం మీద వ్యతిరేకతకు నిదర్శనం అని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటుంటే.. మహిళా లోకం జగన్ కు అండగా నిలిచిందని వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయో తెలియాలి అంటే మాత్రం.. జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Also Read : టీడీపీకి ఈసీ లొంగిపోయింది, అందుకే అక్కడ హింసాత్మక ఘటనలు- పేర్నినాని

ట్రెండింగ్ వార్తలు