CM Jagan : ఎన్టీఆర్ నుంచి మోడీ దాకా‌ అందరినీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు : సీఎం జగన్

అగ్రిగోల్డ్ కంపెనీని దోచుకుంది చంద్రబాబు అయితే అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులిచ్చింది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారన్నారు.

Jagan criticized Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు చేశారు. ఎన్టీఆర్ నుంచి మోడీ దాకా‌ చంద్రబాబు అందరినీ వెన్నుపోటు పొడిచాడని వ్యాఖ్యానించారు. ఆడపిల్లల చదువుపై చంద్రబాబు ఏనాడైనా శ్రద్ధ చూపాడా అని ప్రశ్నించారు. అక్క చెల్లెమ్మలకు నాలుగేళ్లలో 75 వేలు ఇస్తున్నామని చెప్పారు. అక్క చెల్లెమ్మలకు తోడు నిలిస్తే పేదరికం నుంచి బయటపడతారని తాము పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. కానీ, చంద్రబాబు గతంలో ఎప్పుడూ వారి గురించి ఆలోచించలేదన్నారు. చంద్రబాబుకు మనసు లేదని విమర్శించారు.

టిడ్కో ఇళ్లు తామే కట్టామని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని…తాము అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవన్నారు. టిడ్కో ఇళ్ల బాధ్యతను తామే తీసుకొని బాగు చేయించి పూర్తి చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. లక్షల మంది పక్కా ఇళ్లు లేకుండా ఎందుకు ఉండిపోయారో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వద్ద సమాధానం ఉందా అని ప్రశ్నించారు.

CM Jagan : సభలో గవర్నర్ ను టీడీపీ ఎమ్మెల్యేలు అవమనించారు : సీఎం జగన్

తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 31 లక్షల మందికి పైగా ఇళ్లస్థలాలిచ్చి కట్టించి ఇస్తున్నామని పేర్కొన్నారు.
బీసీలను పనిముట్లుగా వాడుకోవడమే తప్ప చంద్రబాబు చేసింది ఏముందని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీని దోచుకుంది చంద్రబాబు అయితే, అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులిచ్చింది మాత్రం తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు