Andhra Pradesh : ఏడుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ హోదా

ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ ర్యాంక్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు ఐపీఎస్ అధికారులకు డీజీ ర్యాంక్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కేడర్కు చెందిన అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రకాష్, మహమ్మద్ హసన్ రేజా, హరీష్ కుమార్ గుప్తా, పిఎస్ఆర్ ఆంజనేయులు, కసిరెడ్డి వి.ఆర్.ఎన్.రెడ్డి, నళిని ప్రభాట్‌లకు డీజీ హోదా కల్పించింది ప్రభుత్వం. జనవరి ఒకటో తేదీ నుంచి డీజీ ర్యాంక్ స్కేలు అమలులోకి రానుంది. వీరిలో అంజనా సిన్హా, నళినీప్రభాట్ ప్రభుత్వం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.

చదవండి : Andhra Pradesh : వంగవీటి రాధాకు హాని జరిగితే టీడీపీ నేతలదే బాధ్యత

ట్రెండింగ్ వార్తలు