Srinagar Encounter : కశ్మీర్లోని శ్రీనగర్ సిటీ శివార్లలో ఇవాళ జరిగిన రెండు వేరువేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. హర్వాన్లో జరిగిన ఎన్కౌంటర్లో.. లష్కరే తొయిబా(LeT) టాప్ కమాండర్ సలీమ్ పర్రేను హతమార్చినట్టు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
హర్వాన్కు సమీపంలోని గాసు గ్రామంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాది ఏ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి అన్న అంశాలపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ALSO READ Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ