Man Shot Daughter: పరువు హత్య.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురును కాల్చి చంపిన తండ్రి.. సహకరించిన తల్లి

కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో ఆమెను కాల్చి చంపాడు తండ్రి. ఈ హత్యలో ఆమె తల్లి కూడా సహకరించింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది.

Man Shot Daughter: ఢిల్లీ పరిధిలో పరువు హత్య జరిగింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో కూతురును కాల్చి చంపాడో తండ్రి. ఈ హత్యలో యువతి తల్లి కూడా సహకరించింది. హత్య తర్వాత మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి, రహదారి పక్కన పడేసి వెళ్లిపోయాడు.

Narayan Jagadeesan: విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల మోత.. 50 ఓవర్లలో 506 పరుగులు చేసిన తమిళనాడు.. దినేష్ కార్తీక్ విమర్శలు

ఈ ఘటన ఇటీవల ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీకి చెందిన ఆయుషి చౌదరి అనే 22 ఏళ్ల యువతి ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయి, వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చింది. అయితే, తన కూతురు మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆయుషి తండ్రి ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగేటప్పుడు ఆయుషి తల్లి అక్కడే ఉంది. హత్య తర్వాత ఆయుషి మృతదేహాన్ని ఒక సూట్‌కేస్‌లో పెట్టి, ఉత్తర ప్రదేశ్, మధుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వే దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు ఆమె తండ్రి నితీష్ యాదవ్. అనంతరం కూతురు కనిపించడం లేదని పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.

India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో టీ20.. వర్షం ముప్పు తప్పదా?

తర్వాత పోలీసులకు రహదారి పక్కన సూట్‌కేస్‌లో ఆయుషి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని గుర్తించేందుకు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ కుటుంబంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆయుషి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ హత్యలో తనతోపాటు భార్య ప్రమేయం కూడా ఉందన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు