Dalit man dies: రూ.3 వేల కోసం దళితుడిని కర్రలతో కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు

ఓ దళితుడిని రూ.3 వేల కోసం కొట్టి చంపారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్ పూర్ ప్రాంతం, ఘోష్ గఢ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. 33 ఏళ్ల ఇందెర్ కుమార్ అనే వ్యక్తి ఘోష్ గఢ్ లో ఓ దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడని అన్నారు.

Dalit man dies: ఓ దళితుడిని రూ.3 వేల కోసం కొట్టి చంపారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్ పూర్ ప్రాంతం, ఘోష్ గఢ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. 33 ఏళ్ల ఇందెర్ కుమార్ అనే వ్యక్తి ఘోష్ గఢ్ లో ఓ దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడని అన్నారు.

ఇందెర్ కుమార్ తెలిసిన వ్యక్తి కావడంతో అతడికి సాగర్ యాదవ్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం రూ.19,000 ఇచ్చి, విద్యుత్తు బిల్లు కట్టమన్నాడని పోలీసులు చెప్పారు. అయితే, అందులో ఇందెర్ కుమార్ రూ.3,000 ఖర్చు చేసుకుని, విద్యుత్తు బిల్లు కట్టలేదని అన్నారు. దీంతో అతడిని మరో ఇద్దరితో కలిసి వచ్చి సాగర్ యాదవ్ నిలదీశాడని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇందెర్ కుమార్ ను నిందితులు ముగ్గురూ కలిసి కర్రలతో కొట్టి గాయపర్చారు. తీవ్రగాయాలపాలైన ఇందెర్ కుమార్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించి ఇందెర్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడి తండ్రి దీప్ చంద్ నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు. ఖర్చు చేసిన రూ.3,000 త్వరలోనే ఇచ్చేస్తానని తన కుమారుడు ఇందెర్ కుమార్ చెప్పినప్పటికీ సాగర్ యాదవ్ ఒప్పుకోకుండా కొట్టాడని దీప్ చంద్ అన్నారని పోలీసులు తెలిపారు.

Samantha : ఆలోచనా విధానంపైనే మన బలం ఆధారపడుతుంది.. సమంత బ్యాక్ టు ఫిట్నెస్ మోడ్..

ట్రెండింగ్ వార్తలు