Extra Marital Affair : తన వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయి, అభ్యంతరం చెప్పటంతో ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందొక భార్య. జోగులాంబ గద్వాల జిల్లాలోని అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రాజు, భార్య మాధవితో కలిసి గద్వాల మండలం తూర్పుపల్లిలో బత్తాయి తోటలో పని చేస్తున్నాడు.
మాధవికి వివాహానికి ముందే మక్తల్ మండలం కలవలదొడ్డి గ్రామానికి చెందిన మునేష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. వివాహానంతరం కూడా మాధవి అతనితో అక్రమ సంబంధాన్ని కొనసాగించసాగింది. కొన్నాళ్లకు ఈవిషయం భర్త రాజుకు తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుంది మాధవి. ఈవిషయం తన ప్రియుడు మునేష్ కు చెప్పింది. ఇద్దరూ కలిసి రాజు హత్యకు ప్లాన్ చేశారు. అక్టోబర్ 2వ తేదీ రాత్రి రాజుకు అన్నంలో మత్తు ట్యాబ్లెట్లు కలిసి భోజనం వడ్డించింది. రాజు మత్తులోకి జారుకోగానే ప్రియుడికి ఫోన్ చేసింది.
Also Read : Attempt To Rape : వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం
మునేష్ తన స్నేహితులైన కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్రలతో అక్కడకు చేరుకున్నాడు. వారు ఐదుగురు కలిసి రాజు మెడకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం హత్యను ప్రమాదంగా చిత్రీకరించటానికి శవాన్ని తీసుకువెళ్లి పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద పడేసి వెళ్లిపోయారు.
మర్నాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్య మాధవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. హత్యకు సహకరించిన మిగిలిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.