NTR30: ఎన్టీఆర్, కొరటాల సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ?

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ కోసం సినీ అభిమానులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ క్రేజ్ స్థాయిని సినీ విశ్లేషకులు కూడా అంచనా..

NTR30: టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ కోసం సినీ అభిమానులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, తారక్ క్రేజ్ స్థాయిని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేయలేనంతగా పెరిగి పోతుందని టాక్ నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాల మీద కూడా ఈ హీరోలు ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటనతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..

ఇప్పటికే కొరటాల శివ సినిమా కోసం తారక్ ఫుల్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు ఈ సినిమా కోసం బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం ముగ్గురు హేమాహేమీ రచయితలు రంగంలోకి దిగి కొన్ని సీన్స్ పై చర్చలు, మార్పులు జరుగుతున్నాయట. మరోవైపు ఈ సినిమా కోసం కొరటాల నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలు అలియా భట్, కియారా అద్వానీల పేర్లు వినిపిస్తూ వస్తుండగా ఇప్పుడు మరో పేరు ఫైనల్ అయిందని మరో టాక్ మొదలైంది.

Ajay Devgn : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చాలా కాలంగా టాలీవుడ్ లో మంచి సినిమాతో లాంచింగ్ కోసం వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కొరటాల-తారక్ సినిమా కోసం జాన్వీని సంప్రదించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అదే నిజమైతే జాన్వీకి బెస్ట్ డెబ్యూతో పాటు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించగా వచ్చే నెల నుండి షూటింగ్ కూడా మొదలు కానుంది.

ట్రెండింగ్ వార్తలు