NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రాబోతున్న సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న అప్డేట్ను అయితే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
NTR30 : జాన్వీ పోస్ట్, ఎన్టీఆర్ కామెంట్.. వైరల్ అవుతున్న పోస్ట్!
ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశంపై చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా చాలా పేర్లు వినిపించాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఫైనల్ చేసింది. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Janhvi Kapoor : #NTR30 అప్డేట్.. అనుకున్నదే అయింది.. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీనే హీరోయిన్..
ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మరో వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల మీద ఓ బ్లాక్బస్టర్ సాంగ్ను రీమిక్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్, శ్రీదేవిల ఆల్టైమ్ రొమాంటిక్ రెయిన్ సాంగ్ ‘‘ఆకు చాటు పింద తడిసే’’ను ఈ సినిమాలో రీమిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ‘వేటగాడు’ మూవీలోని ఈ పాట ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల పై ఈ సాంగ్ రీమిక్స్ చేస్తే, ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ను అందిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.