Vijay Devarakonda: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే ఎలాంటి క్రేజ్ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో మనకు కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, పూరీ-విజయ్ దేవరకొండ కాంబోలో మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగితి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అనౌన్స్మెంట్ను చేశారు చిత్ర యూనిట్.
పూరీ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ మరోసారి నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు జనగణమన(JGM) అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఇక ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టైటిల్ పోస్టర్ చూస్తే మనకు అర్థం అవుతుంది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ మేజర్గా మనకు కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమా కథను విజయ్ దేవరకొండకు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్టును వెంటనే ఓకే చేశాడట ఈ హీరో. ఇక ఈ సినిమా లాంఛ్లో భాగంగా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. కాగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్లో హీరో మాట్లాడుతూ.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మరోసారి పని చేయడం సంతోషంగా ఉందని అన్నాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్లో ఓ భాగం కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని విజయ్ అన్నాడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని ఆయన తెలిపాడు.
అటు ఈ సినిమా గురించి దర్శకుడు పూరీ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు బాగా నచ్చే కథాంశం ఈ సినిమాలో ఉంటుందని.. ఇది ప్రేక్షకులను ఖచ్చితంగా ఉత్తేజపరుస్తుందని అన్నారు. విజయ్తో రెండోసారి కలిసి పనిచేయడం తనకు మరింత ఎనర్జీని ఇచ్చిందని అన్నాడు. అటు ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఛార్మీ, పూరీ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్తో పనిచేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు.
Vijay Devarakonda: స్పీడ్ పెంచిన రౌడీ.. ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు!
కాగా జనగణమన చిత్ర రెగ్యులర్ షూటింగ్ను ఏప్రిల్ నెలలో ప్రారంభించాలని, ఈ సినిమాను 2023 ఆగస్టు 03న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.