Khushbu: సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ కల్చర్ గురించి ఇప్పటికే చాలామంది నటీమణులు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా సినీ పరిశ్రమలో ఈ లైంగిక వేధింపులపై మీ టూ ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. స్టార్ హీరోయిన్స్ నుండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదిగే హీరోయిన్స్ వరకు ఎంతో మంది వారి వారి అనుభవాలను చెప్పుకోగా ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా తనకు జరిగిన కమిట్మెంట్ అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
తెలుగు, తమిళ బాషలలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుని, తమిళనాడులో ఏకంగా అభిమానులతో గుడి కట్టించుకున్న హీరోయిన్ ఖుష్బూ. తెలుగులో 1986లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తొలి సినిమా కలియుగ పాండవులుతో ఖుష్బూ హీరోయిన్గా పరిచయం కాగా ఆ తర్వాత రాజేంద్రప్రసాద్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే తెలుగులో ఖుష్బూ చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఒకదశలో ఏక కాలంలో దక్షణాది బాషలలో బిజీ బిజీగా గడిపిన హీరోయిన్ కుష్బూకు కూడా ఓ టాలీవుడ్ హీరో నుంచి వేధింపులు ఎదురయ్యాయంట. తనను ఓ అగ్ర హీరో కమిట్మెంట్ అడిగాడని.. స్టార్ హీరో అయి ఉండి అలా కమిట్మెంట్ అడిగేసరికి చాలా కోపం వచ్చిందని, దాంతో మీ కూతుర్ని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే నేను కూడా కమిట్మెంట్ ఇస్తానని సదరు హీరోకు చెంప చెళ్లుమనిపించే ఆన్సర్ ఇచ్చిందట. అయితే తనను కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ హీరో పేరు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో ఈ స్టార్ హీరో ఎవరు అయ్యింటారా అని నెటిజన్లు సందేహంలో మునిగిపోయారు.