Drushyam 2 : వెంకీ స్పీడ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ‘దృశ్యం 2’ షూటింగ్ పూర్తి!..

విక్టరీ వెంకటేష్ ఇటీవలే తమిళ్ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ షూటింగ్ పూర్తి చేశారు. వెంటనే మరో రీమేక్ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ఇప్పుడు ఆ మూవీ కూడా కంప్లీట్ చేసేశారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ వచ్చిన సంగతి తెలిసిందే..

Drushyam 2: విక్టరీ వెంకటేష్ ఇటీవలే తమిళ్ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ షూటింగ్ పూర్తి చేశారు. వెంటనే మరో రీమేక్ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ఇప్పుడు ఆ మూవీ కూడా కంప్లీట్ చేసేశారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం’ కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ వచ్చిన సంగతి తెలిసిందే.

మే 14న ‘నారప్ప’ వస్తున్నాడప్పా..

లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘దృశ్యం’ రీమేక్ చేసి హిట్ కొట్టిన వెంకీ సీక్వెల్ కూడా పట్టాలెక్కించారు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై.లి. సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘దృశ్యం 2’ ప్రారంభం..

50 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని రంగంలోకి దిగింది చిత్రబృందం.. అనుకున్నట్లుగానే కేవలం 40 రోజుల్లోనే వెంకీ తన పోర్షన్ పూర్తి చేసేశారు. సీనియర్ నరేష్, నదియా కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు