Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తనతో పోటీ పడుతున్న హీరోలతో మంచి స్నేహం మెయిన్టైన్ చేస్తూ, తన సీనియర్ హీరోలతో గౌరవంగా ప్రవర్తిస్తూ.. ఇతర హీరోల అభిమానుల అభిమానాన్ని కూడా సొంత చేసుకుంటున్నాడు. తాజాగా నేడు (సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లో అక్కినేని కుటుంబం ఏఎన్నార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Celebrating ANR 100 : ఆ ఇమేజ్ పోగొట్టుకోడానికి.. ఎన్టీఆర్ పక్కన కమెడియన్గా ఏఎన్నార్..
ఇక ఈవెంట్ కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు. ఇక ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరయ్యి ఏఎన్నార్ కి నివాళులు ఘటించాడు. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. గతంలో నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు రామ్ చరణ్ హాజరయ్యి, బాలకృష్ణతో పాటు స్టేజి పై కనిపించి నందమూరి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
Venkaiah Naidu : రాజకీయ వారసత్వం v/s సినిమా వారసత్వం.. నెపోటిజం పై వెంకయ్య నాయుడు కామెంట్స్..
ఇక ఇప్పుడు ఏఎన్నార్ శతజయంతి వేడుకకు కూడా రామ్ చరణ్ రావడం పై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు నందమూరి అభిమానులను, ఇప్పుడు అక్కినేని అభిమానులను చరణ్ గెలుచుకున్నాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇదే ఈవెంట్ లో మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి పక్కపక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడడం వంటి సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.