Delhi Commission for Women: ఇటీవల ఢిల్లీ పరిధిలో ఒక మహిళ నిర్భయ తరహా అత్యాచారానికి గురైనట్లు నాటకమాడిన సంగతి తెలిసిందే. ఘజియాబాద్లో ఆటో కోసం ఎదురు చూస్తుండగా, ఫోర్ వీలర్లో వచ్చిన కొందరు వ్యక్తులు తనను అపహరించుకుని వెళ్లి, రెండు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆమె నమ్మించింది.
India: తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు.. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన భారత విదేశీ నిల్వలు
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారించగా అసలు విషయం బయటపడింది. మహిళ చెప్పిందంతా అబద్ధమే అని పోలీసులు గుర్తించారు. కొందరు వ్యక్తులతో ఆస్తి విషయంలో తగాదాలు ఉండటంతో, వారిని ఇరికించేందుకు ఆమె ఈ నాటకం ఆడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన విషయంలో మొదట ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. బాధితురాలికి అండగా నిలవాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించింది. అయితే, ఇదంతా ఇప్పుడు ఆ మహిళ ఆడిన నాటకం అని తేలడంతో ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సంబంధిత మహిళపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Jharkhand: స్కూటీపై వెళ్తున్న యువతి కిడ్నాప్… అత్యాచారానికి పాల్పడ్డ పది మంది
ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్కు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ లేఖ రాశారు. ఒక వేళ మహిళ నిజంగానే నాటకమాడి, తప్పు చేసినట్లు తేలితే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖలో కోరింది. అలాగే ఆ మహిళ నిజంగానే గాయపడిందా లేదా అనే విషయం కూడా తేల్చాలని సూచించింది.