దేశంలో వంట గ్యాస్ సిలెండర్ ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ ఎల్పీజీ సిలెండరుపై మెట్రో నగరాల్లో 37రూపాయల వరకు ధర పెంచింది. కొన్ని నెలల పాటు వరుసగా భారీగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా పెంచింది కేంద్రం. నేటి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.11.50 పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) స్పష్టం చేసింది. కోల్కతాలో రూ.31.50, ముంబైలో రూ.11.50, చెన్నైలో రూ.37 మేర ఖర్చు పెరిగింది.
14.2 కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలెండరు ధర ఢిల్లీలో నిన్నటి వరకు రూ.581.50 ఉండగా, ఇప్పుడు రూ.593కి చేరుకుంది. కోల్కతాలో నిన్నటి వరకు రూ.584.50కి ఉండగా, ఇప్పుడు 616కి పెరిగింది. ముంబైలో నిన్నటి వరకు 579 రూపాయలు ఉండగా, 590.50కి చేరింది. అలాగే, చెన్నైలో నిన్నటి వరకు రూ.569.50 ఉండగా, ఇప్పుడు 606.50కి చేరుకుంది.
Read: Keys of Safety : టాటా మోటార్స్ కార్లపై రూ.5వేలు EMI ఆఫర్