బెంగళూరులో షాకింగ్ ఘటన.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి, వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని..

ఊహించని ఈ పరిణామంతో ఆమె షాక్ కి గురైంది. తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ వ్యక్తి నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. గట్టిగా కేకలు వేసింది.

Woman Groped (Photo Credit : Google)

Man Gropes Woman : బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన మహిళపై లైంగిక దాడి జరిగింది. ఓ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. మహిళ వాకింగ్ చేస్తుండగా సడెన్ గా ఓ వ్యక్తి వచ్చి ఆమెను వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. భయంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొనన్ కుంటే ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘోరం జరిగింది. ఓ మహిళ ఒంటరిగా మార్నింగ్ వాకింగ్ చేస్తోంది. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు. వెనుక నుంచి ఆమెను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత లైంగిక దాడి చేశాడు. ఊహించని ఈ పరిణామంతో ఆమె షాక్ కి గురైంది. తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ వ్యక్తి నుంచి తనను తాను విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. గట్టిగా కేకలు వేసింది.

అయినా ఆ వ్యక్తి వదల్లేదు. చివరికి వాడి నుంచి ఆమె తప్పించుకుని కాస్త ముందుకెళ్లింది. ఇంతలో ఆ దుండగుడు ఆమె వెనుకే పరిగెత్తుకుని వచ్చాడు. మరోసారి ఆమెని గట్టిగా తన చేతులతో పట్టుకున్నాడు. ఆమె అవరకుండా నోరు మూసే ప్రయత్నం కూడా చేశాడు. అయితే, ఆమె గట్టిగా కేకలు వేస్తూ అతడి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేసింది. దాంతో భయపడ్డ దుండగుడు ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

బాధిత మహిళది రాజస్తాన్. బెంగళూరులో నివాసం ఉంటోంది. ఆమె మార్నింగ్ వాక్ కు వెళ్లింది. తన స్నేహితురాలి ఇంటి ముందు నిల్చోని ఉంది. స్నేహితురాలు వస్తే ఆమెతో కలిసి వాకింగ్ చేయాలని అక్కడ ఆగింది. అదే సమయంలో ఈ దారుణం జరిగింది. దుండగుడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో కానీ, సడెన్ గా వెనుక నుంచి ఆమెను పట్టుకుని లైంగిక దాడికి ప్రయత్నించాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మార్నింగ్ వాక్ కు వెళ్లే మహిళలు, యువతులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఒంటరిగా బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మహిళలు ఒంటరిగా కాకుండా వెంట ఎవరైనా ఉండేలా చూసుకోవాలన్నారు. చుట్టూ గమనిస్తూ ఉండాలని, ఏదైనా అనుమానం కలిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని జాగ్రత్తలు చెప్పారు. జన సంచారం ఎక్కువగా లేని ప్రాంతాల్లోకి మహిళలు ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిదని పోలీసులు సూచించారు.

Also Read : ఢిల్లీ ఓల్డ్ రాజేంద్రనగర్‌లో వెలుగు చూసిన మరో విషాదం.. పాపం ఆ యువతి..

ట్రెండింగ్ వార్తలు