Gurjala and Dachepalli municipal elections : గురజాల, దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అధికారుల తీరుపై టీడీపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ అభ్యర్థులు, పోలింగ్ బూత్, ఓటర్లకు పోలీసులతో భద్రత కల్పించాలని సూచించింది.
అదనపు బలగాలతో భద్రత కల్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించే విధంగా ప్రసారం చేయాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.