AP Land Rates: ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కొత్త జిల్లాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు సహా..ఆయా జిల్లా కేంద్రాల్లో పరిపాలనా భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువ కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో కొత్తగా ఏర్పాటైన 11 జిల్లాలు, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పెంచిన భూముల ధరలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన రెండు రోజుల్లోనే ప్రత్యేక మార్కెట్ రివిజన్ పేరిట భూముల విలువను ప్రభుత్వం పెంచింది. ఇక మిగతా జిల్లాల్లో(రాష్ట్ర వ్యాప్తంగా) పెంచిన భూముల ధరలు ఆగష్టు నుంచి అమల్లోకి రానున్నాయి.
Also read:Cannabis : విశాఖ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
జాతీయ రహదారులు, స్థానిక పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు వంటి తదితర అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఆమేరకు ఆయా ప్రాంతాల్లో డిమాండ్ బట్టి భూముల మార్కెట్ విలువను 13-75 శాతం మేర పెంచినట్లు తెలిసింది. మార్కెట్ విలువ పెంచడంతో రెజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రానుంది. కొత్త జిల్లాల్లో పెంచిన మార్కెట్ విలువ అమల్లోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో భూముల భారీగా పెరిగాయి. విశాఖ, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ జిల్లా నుంచి ఏర్పడ్డ కొత్త జిల్లాల్లో భూముల విలువ మునుపటికంటే 25-35శాతం మేర పెరిగాయి.
Also Read:Purandeswari On NTR District : ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు