కీలక నేతలు అరెస్ట్? ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయి.

SIT On Poll Violence : ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత 3 జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటైంది. ఈసీ ఆదేశాల మేరకు సిట్ నియామకం జరిగింది. ఇవాళ రాత్రిలోగా అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఎన్నికల హింసపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో విచారణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చోటు చేసుకున్న ప్రతి ఘటన పై సిట్.. ఈసీకి నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది ఈసీ.

హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపైనా తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయి.

ఘటనలు చోటు చేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాల మోహరించారు.

ఇప్పటికే 20 కంపెనీల పారామిలటరీ బలగాలు ఏపీకి చేరుకున్నయి. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను రెండంచెల నుంచి మూడంచెలకు పెంచారు. స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు ఏపీ సీఈఓ.

* మూడు జిల్లాల్లో జరిగిన హింసై విచారణ చేయనున్న సిట్
* కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదిక ఇవ్వనున్న సిట్
* సిట్ ఏర్పాటుపై ఏపీ సీఎస్ సమీక్ష

Also Read : చంద్రబాబుకు భద్రత పెంపు.. ఏపీలో జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ట్రెండింగ్ వార్తలు