Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పవన్ తాను బస చేసిన హోటల్ వదిలి బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ తాను ఉంటున్న నోవాటెల్ హోటల్ కిటికీలోంచి, తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు.
అక్కడి దృశ్యాల్ని వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై సెటైర్లు వేశారు. ‘‘ప్రముఖ నాయకుడు, సీఎం థానోస్ ఆధ్వర్యంలో మన ప్రియమైన పోలీసులు జనసేన తరఫున ఎలాంటి కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. నాకు మిగిలింది ఈ ఒక్క అవకాశం మాత్రమే. కిటికీలోంచి అభివాదం చేడయం మినహా మరో అవకాశం లేదు. ఏపీ పోలీసులు కిటికీలోంచి అభివాదం కూడా చేయద్దని చెప్పరనే అనుకుంటున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. పవన్ కోసం హోటల్ వద్దకు భారీ స్థాయిలో అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
Madhya Pradesh: డబ్బు కోసం గూగుల్ మేనేజర్ కిడ్నాప్.. పెళ్లి పేరుతో నాటకం.. రూ.40 లక్షలు డిమాండ్
వారిని అదుపు చేసేందుకు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు అభిమానులు హోటల్ వైపు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ పరిసరాల్లోకి చొచ్చుకురాకుండా ఉండేందుకు రోప్లు ఏర్పాటు చేశారు. అయితే, పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా అభిమానుల రాక తగ్గడం లేదు.
Our beloved AP police under the Eminent Leadership of CM
Sri Thanos barred me not to hold Janasena programs, no rallies, no meetings.Left me with this option only… from my Room window. pic.twitter.com/3oatyfAtHI— Pawan Kalyan (@PawanKalyan) October 16, 2022