Sankranthi celebrations : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇళ్లముందు తెల్లవారు జామునే కల్లాపి చల్లి , ఎంతో అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరిస్తున్నారు.
వాటి మధ్యలో గొబ్బెమ్మలు కొలువుదీరుతున్నాయి. హరిదాసు కీర్తనలు, బసవన్నల నాట్యాలు, పతంగుల రెపరెపలతో పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. నిన్న భోగిమంటలు వెలిగించి పండగకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ప్రజలు. ఇవాళ మకర సంక్రాంతి జరుపుతున్నారు. రేపు కనుమతో సంక్రాంతి పూర్తవుతుంది.
ఏపీ, తెలంగాణలో నిన్న భోగి వేడుకలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంలు వేసి.. చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగిమంటలు వెలిగించి.. పండగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. భోగి మంటల్లో పాత సామాగ్రి వేసి అగ్ని దేవున్ని ప్రార్థిస్తున్నారు.
భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసి సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకున్నారు. వాడవాడలా చిన్నాపెద్దా సందడి చేశారు. దీంతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. గంగిరెద్దుల ఆటపాటలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇటు బోర్డర్లో గస్తీ కాస్తున్న జవాన్లు కూడా సరిహద్దుల్లోనే భోగి మంటలు వెలిగించి డ్యాన్సులు చేశారు.