Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుల మోత మోగిస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఒక్క‌రోజే భారీ స్థాయిలో హుండీ ఆదాయం ల‌భించింది. పదేళ్ల తర్వాత రికార్డు బద్దలైంది.

Tirumala Income : కలియుగ వైకుంఠ దైవం, వడ్డీకాసుల వాడు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుల మోత మోగిస్తోంది. రికార్డు స్థాయిలో రూ.6కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.6కోట్ల 18 లక్షలుగా టీటీడీ ప్రకటించింది. శ్రీవారి హుండీ ఆదాయం ఇలా రూ.6 కోట్లు దాటడం ఇదే తొలిసారి. 2012 ఏప్రిల్ 1 న వచ్చిన రూ.5కోట్ల 73 లక్షల ఆదాయమే ఇప్పటివరకు అత్యధికం. పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామికి భ‌క్తులు స‌మ‌ర్పిస్తున్న కానుక‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఒక్క‌రోజే ఏకంగా రూ.6 కోట్ల‌కు పైగా హుండీ ఆదాయం ల‌భించింది. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇప్ప‌టిదాకా ఒక రోజులో ల‌భించిన అత్య‌ధిక హుండీ ఆదాయంగా ఆదివారం నాటి హుండీ ఆదాయం రికార్డుల‌కెక్కింది.

TTD EO DharmaReddy : ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల నుండి 12 ర‌కాల ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ‌-టీటీడీ ఈవో

ఆదివారం తిరుమ‌ల వెంక‌న్న‌కు హుండీలో స‌మ‌ర్పించిన ఆదాయాన్ని టీటీడీ సోమ‌వారం లెక్కించింది. ఈ లెక్కింపులో ఆదివారం నాటి విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. ఇప్ప‌టిదాకా తిరుమ‌ల వెంక‌న్న హుండీకి ఒక‌రోజు అత్య‌ధికంగా ల‌భించిన ఆదాయం రూ.5.73 కోట్లే. ఈ హుండీ ఆదాయం 2012 ఏప్రిల్ 1న ల‌భించింది. ఆ త‌ర్వాత అంత‌కుమించిన ఆదాయం ఇప్ప‌టిదాకా ల‌భించ‌లేదు. తాజాగా తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే వెంక‌న్న హుండీ ఆదాయం రూ.6 కోట్ల మార్క్‌ను దాటేసింది.

Srivari Salakatla Brahmotsavam: సెప్టెంబ‌ర్ 27 నుండి తిరుమల శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు.. ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు

ఇటీవలి కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత రెండు నెలలుగా కూడా నిత్యం నాలుగు కోట్లకు పైబడే ప్రతి రోజూ హుండీ ఆదాయం లభిస్తోంది. ఒక నెలలోనే హుండీ ఆదాయం దాదాపు రూ.120 కోట్లు దాటిన పరిస్థితి తిరుమలలో కనపడింది. ఇక తాజాగా హుండీ ఆదాయం ఒక్కరోజులో రూ.6కోట్లు దాటడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు