Dead Body In Water Tank : హైదరాబాద్ లో జలమండలి వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ముషీరాబాద్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ జలమండలి వాటర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అందులో ఓ వ్యక్తి శవం కనిపించింది. దాంతో వారు హడలిపోయారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు.
SI Raghava Reddy Suicide: మద్యంలో విషం కలుపుకుని తాగి ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్య!
అయితే శవం ఉన్న ట్యాంకు నీళ్లను కొన్ని రోజులుగా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. శవం సంగతి తెలియడంతో ఆ నీళ్లను తాగిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ శవం ఎన్ని రోజుల నుంచి ట్యాంకులో ఉందో అంటూ వారు చర్చించుకుంటున్నారు.
కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ట్యాంకు నుంచి శవాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ఇది హత్యా లేక, ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మరణించాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఈ వారంలో ఓ ఇంట్లో నీటిలో వెంట్రుకలు, చిన్న చిన్న మాంసం ముద్దలు వచ్చాయని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల ఆదేశాలతో సిబ్బంది రంగంలోకి దిగారు. ట్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కొన్ని రోజులుగా ఈ ట్యాంకు నీటిని తాగిన ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Girl Students Drugged Molested : స్కూల్లో ఘోరం… 17మంది బాలికలకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి
ట్యాంక్పై చెప్పులు ఉండడంతో అవి మృతునికి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చెప్పులను బట్టి మృతుని వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.