Haryana Hanuman temple : దొంగలకు దేవుడంటే భయమే లేకుండాపోయింది.గుడుల్లో చోరీలు చేస్తు భయం కంటే డబ్బులే ముఖ్యమన్నట్లుగా దోచేస్తున్నారు. పైగా దొంగ భక్తితో నాటకాలు ఆడి హనుమాన్ చాలాసా చదివి మరీ ఆనూపాను తెలుసుకున్నాడు. భక్తులు స్వామివారికి వేసే కానుకలపై కన్నేశాడు. భక్తులు అందరితో కలిసి హనుమాన్ చాలీసా చదివాడు. భక్తులతోపాటు తాను కూడా స్వామివారికి హుండీలో రూ.10లు వేశాడు. ఆ తరువాత ఆ హుండీయే లేపేశాడు ఓ దొంగ భక్తుడు.
హరియాణాలోని రేవాడీ జిల్లా ధరుహెరా పట్టణ హనుమాన్ ఆలయంలో ఓ దొంగ భక్తుడి నిర్వాకం సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడింది. ప్రతీరోజులాగే పూజారి హనుమాన్ టెంపుల్లో పూజలు చేశారు. భక్తులంతా కలిసి హనుమాన్ చాలీసా చదివారు. ఆ తరువాత పూజలు ముగిసిన తరువాత పూజారి గుడికి తాళాలు వేసి వెళ్లిపోయారు.
Brij Bhushan : మహిళా విలేఖరిపై బ్రిజ్ భూషణ్ సింగ్ అనుచిత ప్రవర్తన
మర్నాడు ఉదయం గుడి తెరిచేందుకు వచ్చిన పూజారి షాక్ అయ్యారు. దేవాలయంలో హుండీ తాళం పగలగొట్టి ఉంది. దీంతో పూజారి వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన విషయం చెప్పారు. వెంటనే వచ్చిన పోలసీులు ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. చోరీ చేసిన దొంగ అంతకు ముందు రోజు గుడికి వచ్చాడని గుర్తించారు పూజారి. భక్తులతో పాటు కూర్చొని హనుమాన్ చాలీసా చదివినవాడే ఈ చోరీ చేసినట్లుగా గుర్తించారు. చాలీసా పఠించిన తరువాత రూ.10 కానుకగా హుండీలో వేశాడు. అందరితో పాటు తాను కూడా వెళ్లిపోయాడు. ఆ తరువాత తాపీగా వచ్చి హుండీ పగలగొట్టి డబ్బు దోచేసినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు సదరు దొంగ భక్తుడి కోసం వెతుకుతున్నారు.