Taliban Drugs : డ్రగ్స్ బానిసలకు అన్నం పెట్టడం లేదు, గుండ్లు గీయిస్తున్నారు..తాలిబన్ల అరాచకం

డ్రగ్స్ వాడుతూ...చిక్కి శల్యమై దాక్కున్న వారిపై అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు తాలిబన్లు.

Afghanistan Drug Addicts : అఫ్ఘానిస్తాన్ ను వశం చేసుకున్న తాలిబన్ల అరాచకాలు ఆగడం లేదు. కనీసం కనికరం లేకుండా వారు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. బహిరంగంగా కాల్చి చంపడం, ఉరి శిక్షలు వేయడం వంటి ఘటనలు ఇటీవలే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసేందే. తాజాగా..మరొక విస్తుగొలిపే విషయం ఒకటి బహిర్గతమైంది. డ్రగ్స్ వాడుతూ…చిక్కి శల్యమై దాక్కున్న వారిపై అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు తాలిబన్లు.

Read More : Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

బలవంతంగా కట్టేసి శిబిరాలకు తరలిస్తున్నారు. వారికి అన్నం పెట్టకుండా..గుండ్లు గీయిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోలో ఉన్న వారు బక్క చిక్కి..గుండ్లు గీయించుకుని ఉన్నారు. వారి చేతిలో ఏవో కాగితాలు కూడా ఉన్నాయి. కాబూల్ లో వేలాది మంది నిరాశ్రయులు హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు ఏళ్ల తరబడి…అలవాటు పడ్డారు. దీనివల్ల వారి శరీరాలు చిక్కి శలమమై పోయాయి. వీరిలో ఎక్కువ మంది తాలిబన్లకు చిక్కకుండా…రహదారుల వంతెనలు..ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. తాలిబన్ పోలీసులు అకస్మిక దాడులు జరిపి..డ్రగ్స్ బానిసలను అదుపులోకి తీసుకుంటున్నారు.

Read More : Electricity Crisis : దేశ వ్యాప్తంగా చీకట్లు తప్పవా ? భయం వద్దంటున్న కేంద్రం

తర్వాత..జైళ్లకు తరలించి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. మొండికేసిన వారిని విచక్షణారహితంగా కొడుతున్నారు. డ్రగ్స్ వదిలేయాలని..లేకపోతే..చావు దెబ్బలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బలవంతంగా గుండ్లు గీయిస్తున్నారు. సరైన తిండి పెట్టకుండా..ఆకలతో అలమిటించేలా చేస్తున్నారు. ఇస్లాం విశ్వాసాల ప్రకారం మత్తు పదార్థాలు సేవించని వారు..సమాజ వినాశకారులని తాలిబన్లు పేర్కొంటున్నారు. వారితో మానిపించేందుకు ఇలాంటి విధానాలే సరైన మార్గమని అంటున్నారు. అయితే..వీరు చనిపోయినా తప్పేం లేదని వారు ప్రకటిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు